అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో హెచ్సీఎల్ టెక్(HCL TEC) కేఆర్సీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెక్ కంపెనీల ఏర్పాటు కోసం సులభతరంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో హెచ్సీఎల్ మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని చెప్పారు.
దావోస్లో ఒప్పందాల ప్రకారమే..
దావోస్లో ఇటీవల జరిగిన ఒప్పందాల ప్రకారమే కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం తెలిపారు. ఇటీవల అమ్జెన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని.. కార్యాలయాన్ని హైదరాబాద్లో ఇటీవలే ప్రారంభించుకున్నామన్నారు. 60 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్సీఎల్ కంపెనీ హైదరాబాద్లో మరో కార్యాలయం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్బాబు, హెచ్సీఎల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
