Advertisement
అక్షరటుడే, భీమ్గల్: మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు శుక్రవారం తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో భీమ్గల్ తహశీల్దార్ మహమ్మద్ షబ్బీర్, ఎంపీడీవో సంతోష్కుమార్, ఎస్సై మహేశ్కుమార్ ఉన్నారు.
Advertisement