SC ST Commission : పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు

SC ST Commission : పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు
SC ST Commission : పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: SC ST Commission : గల్ఫ్ ఏజెంట్​ చేతిలో మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్​లోని అమలాపురం గ్రామానికి చెందిన నరసింహ మూర్తి నందిపేట మండల కేంద్రానికి చెందిన గల్ఫ్​ ఏజెంట్​ కస్పా శ్యామ్​ చేతిలో మోసపోయాడు.

అనంతరం గ్రామంలోనే ఆయనపై శ్యామ్​తో పాటు మధు, సాయిరెడ్డి, గుడ్ల ప్రకాష్ అనే వ్యక్తులు దాడి చేశారు. దీంతో నరసింహమూర్తి నందిపేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అట్రాసిటీ కేసు నమోదైనా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ను కలిసి వినతి పత్రం అందించాడు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఛైర్మన్​ వెంకటయ్య బాధితుడికి హామీ ఇచ్చారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  విద్యార్థులకు దంతవైద్య పరీక్షలు