Ipl Betting | బెట్టింగ్​ ముఠాలపై ‘మహా’ సర్కారుకు ఫిర్యాదు

Ipl Betting | బెట్టింగ్​ ముఠాలపై ‘మహా’ సర్కారుకు ఫిర్యాదు
Ipl Betting | బెట్టింగ్​ ముఠాలపై ‘మహా’ సర్కారుకు ఫిర్యాదు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ipl Betting | మహారాష్ట్రలోని Maharashtra ధర్మాబాద్​ కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్​ దందా అంతాఇంతా కాదు. ప్రతి ఐపీఎల్​ సీజన్​(Ipl season)లో కోట్లాది రూపాయలు ఈ దందా వెనుక చేతులు మారుతున్నాయి. ప్రత్యేకంగా తయారు చేసిన బెట్టింగ్​ యాప్​ల(Betting apps) ద్వారా యువతను ఇందుకు బానిసలుగా చేసి రూ. లక్షల్లో నగదు పెట్టిస్తున్నారు. తీరా.. బెట్టింగ్​ కోసం చేసిన అప్పులను తీర్చలేక పలువురు యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాగా.. బెట్టింగ్​ దందా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు మహారాష్ట్ర సర్కారు(Maharashtra government)కు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

ధర్మాబాద్​ కేంద్రంగా శంకర్​ బొలంవార్​, అంకుశ్​ నిరావార్​, ప్రవీన్​ బర్లేవార్​, మనోజ్​ మందాని సహా పలువురు పెద్ద ఎత్తున బెట్టింగ్​ దందా నిర్వహిస్తున్నారు. ఔరా 24, సాయి తదితర యాప్​ల ద్వారా యూజర్​ ఐడీ, పాస్​వర్డ్​ కేటాయించి అక్రమంగా బెట్టింగ్​ illegally betting నిర్వహిస్తున్నారు. ఇటీవల నిజామాబాద్​ కమిషనరేట్​(Nizamabad commissionerate) పోలీసులు పలువురు యువతను పట్టుకోవడంతో ధర్మాబాద్​ Dharmabad కేంద్రంగా నడుస్తున్న బాగోతం బయటపడింది. సచిన్​ ఉత్తర్వార్​ బుకీగా ఉండి యువతతో బెట్టింగ్​ పెట్టిస్తున్నట్లు గుర్తించారు. కాగా.. సచిన్​ ఉత్తర్వార్​ లాంటి ఎందరో బుకీలను శంకర్​ బొలంవార్​, అంకుశ్​ నిరావార్​, ప్రవీన్​ బర్లేవార్​, మనోజ్​ మందాని పెంచిపోషిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad Cp | రాత్రి పదిన్నర దాటితే జైలుకే.. హోటల్​ నిర్వాహకులపై సీపీ కొరడా

బెట్టింగ్​ దందా కారణంగా రూ.లక్షల్లో అప్పులు చేసిన యువత వాటిని తిరిగి చెల్లించలేక సూసైడ్​కు పాల్పడుతున్నారు. గత సీజన్​లోనే last ipl season దాదాపు పాతిక మంది వరకు ధర్మాబాద్​ darmabad చుట్టు పక్కల ప్రాంతాల్లో యువత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తదనంతరం అక్కడ పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఈ బెట్టింగ్​ దందాను తెలంగాణకు విస్తరించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పలువురు యువత వీరి వద్ద బెట్టింగ్​ పెట్టి తీరా అప్పల పాలై కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో దందాకు పాల్పడుతున్న ముఠాల పట్ల పోలీసులు police of Telangana ప్రాంతాలను పక్కనబెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.

Advertisement