అక్షరటుడే, నిజాంసాగర్: MLA Lakshmi Kantha Rao | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎల్లప్పుడూ పేదల పక్షమేనని జుక్కల్ ఎమ్మెల్యే(Jukkal MLA) తోట లక్ష్మీకాంతారావు(Thota Lakshmi Kantha Rao) అన్నారు. నియోజకవర్గంలోని సిర్పూర్(Sirpur)లో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం దొడ్డు బియ్యం సరఫరా చేయడంతో వాటిని లబ్ధిదారులు తినేవారు కాదన్నారు. దళారులకు విక్రయించేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub Collector Kiranmai), కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) తదితరులు పాల్గొన్నారు.