అక్షరటుడే, వెబ్డెస్క్: అమృత్ టెండర్లపై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు సరికాదని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జి వెలిచాల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలో బీఆర్ఎస్ నేతలను మించిన అవినీతిపరులు లేరని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోచుకున్నారని విమర్శించారు. కేటీఆర్ అవగాహన రాహిత్యంతో అమృత్ టెండర్లపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement