అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lingampet | లింగంపేట మండలం(Lingampeta mandal) సజ్జన్పల్లిలో గురువారం కాంగ్రెస్ బీసీ గ్రామ కమిటీని(Congress Party BC Committee) ఎన్నుకున్నట్లు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే మదన్మోహన్ రావు(MLA Madan Mohan Rao) ఆదేశాల మేరకు ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ కమిటీ(BC Committee)లను ఎన్నుకుంటున్నట్లు చెప్పారు. బీసీ కమిటీ గ్రామ అధ్యక్షుడిగా కర్రొళ్ల బాబు(Karrolla Babu) ఎన్నికయ్యారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీసీ కమిటీ మండలాధ్యక్షుడు దర్శనం సాయిలు, కొలగరి రాజు, మెరుగు జీవన్, సిద్ధిరాములు, మాసన్నగారి కిష్టయ్య, పెద్దోళ్ల సాయిలు, మహేష్ పాల్గొన్నారు.