అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో అరెస్టయిన ఒకరికి సామాజిక సేవ చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. శామీర్‌పేట్‌ మండలం పొన్కల్‌కు చెందిన బత్తిని నవీన్‌కుమార్‌ మద్యం తాగి వాహనం నడుపుతూ ఇటీవల నగరంలోని ఆరోటౌన్‌ పోలీసులకు పట్టుబడగా.. అరెస్ట్‌ చేసి శుక్రవారం నిజామాబాద్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ అజ్మీరా సాకేత్‌ కుమార్‌ ముందు హాజరుపరిచారు. దీంతో ఆయన నిందితుడికి ఒకరోజు సామాజిక సేవ చేయాలని తీర్పు ఇచ్చినట్లు ఎస్‌హెచ్‌వో వెంకట్రావు తెలిపారు. డిచ్‌పల్లిలోని మానవతా సదన్‌లో సామాజిక సేవ చేయించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Dichpalii | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ముగ్గురికి జైలుశిక్ష