Delimitation | అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

Delimitation | అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
Delimitation | అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: సరైన విధానాలు లేకుండా లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy అన్నారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పార్లమెంట్​ స్థానాల పునర్విభజనకు Delimitation వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. త‌మిళ‌నాడు Tamilanadu మంత్రి కేఎన్ నెహ్రూ ఆధ్వ‌ర్యంలో డీఎంకే DMK ఎంపీలు కనిమొళి, రాజా తదితరులు ఢిల్లీలో రేవంత్​రెడ్డిని కలిశారు. డీలిమిటేషన్​కు వ్యతిరేకంగా ఈ నెల 22న చైన్నైలో సీఎం స్టాలిన్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశానికి ఆయనను ఆహ్వానించారు.

Delimitation | రాజకీయంగా పట్టు చిక్కడం లేదనే..

డీఎంకే ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్​రెడ్డి Revanth Reddy మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నియోజక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే న‌ష్టంపై సమావేశం ఏర్పాటు చేసిన స్టాలిన్​ను అభినందించారు. ఏఐసీసీ అనుమతి తీసుకొని సమావేశానికి వెళ్తానని తెలిపారు. దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల South States భాగస్వామ్యం ఎంతో ఉన్నా.. తమకు రాజకీయంగా పట్టు చిక్కడంలేదనే అక్కసుతో బీజేపీ BJP డీలిమిటేషన్ చేయాలని చూస్తోందని సీఎం ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టి ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకుంటామని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan | ఎన్ఎస్ఎఫ్ కార్మికుల ముందస్తు అరెస్టు

Delimitation | త్వరలో అఖిలపక్ష సమావేశం

డీలిమిటేషన్​పై తెలంగాణలో త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క Bhatti Vikramarka, మాజీ మంత్రి జానారెడ్డి Janareddy ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్​కు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామన్నారు. పౌర సమాజం ప్రతినిధుల అభిప్రాయాలను కూడా తీసుకొని నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి నివేదిస్తామన్నారు.

Advertisement