అక్షరటుడే, ఇందూరు: నగరంలోని వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులకు ఒకరోజు వేతనం కట్ చేస్తు డీఈవో అశోక్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలకు సమయానికి రాకపోవడంతో ముందుగా షోకాజ్​ నోటీసులు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులు సంజాయిషీ ఇవ్వగా.. ఒకరోజు వేతనాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఇందల్వాయి మండలం తిర్మన్​పల్లి ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ డిసెంబర్​లో మూడు రోజులపాటు ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. దీంతో కాంప్లెక్స్ హెచ్ఎం ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, మూడు రోజుల వేతనాన్ని వెనక్కి తీసుకోవాలని డీఈవో ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | నగరంలో బాలుడి అనుమానాస్పద మృతి