అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు బోనస్‌ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీపావళి బోనస్‌ కింద రూ.358 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. రేపు ఉదయం వరకు కార్మికుల ఖాతాల్లో ఈడబ్బులు జమవుతాయని భట్టి పేర్కొన్నారు. పండుగ బోనస్‌గా ప్రతి కార్మికుడు రూ.93,750 అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సింగరేణి కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..