అక్షరటుడే, వెబ్డెస్క్ : Ration Cards | తెలంగాణ ప్రభుత్వం రేషన్కార్డు(Ration Card) లబ్ధిదారులకు ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) హుజుర్నగర్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. కాగా తాము అధికారంలోకి వస్తే రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
ఏప్రిల్ కోటా బియ్యం ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరింది. దీంతో ఏప్రిల్ 1 తేది నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడాని సీఎం రేవంత్రెడ్డి హుజూర్నగర్(Huzur Nagar)లో పర్యటించనున్నారు. దీంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్లో రేవంత్రెడ్డి రామస్వామి గుట్ట వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తారు.