అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా–ఇంగ్లండ్​ మ్యాచ్​లో వింత ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి ఏదైనా మ్యాచ్​ ప్రారంభమైతే ఇరుజట్లకు సంబంధించిన జాతీయ గీతాలను ప్లే చేస్తారు. కాని ఆస్ట్రేలియా- ఇంగ్లండ్​ జట్ల మధ్య మ్యాచ్​ జరిగితే పొరపాటుగా భారత్​ జాతీయగీతం ‘జనగనమణ’ను ప్లే చేశారు. దీంతో స్టేడియంలోని అభిమానులు అవాక్కయ్యారు.