అక్షరటుడే, వెబ్డెస్క్ : Election Commission | రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం నేడు సమావేశం కానుంది.
Advertisement
హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ ఎలక్టరోల్ ఆఫీసర్(CEO) సుదర్శన్రెడ్డి ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఓటర్ల జాబితా, నకిలీ ఓట్ల తొలగింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Advertisement