Nizamabad | నన్ను ఎన్​కౌంటర్​ చేయండి : యువకుడి సెల్ఫీ వీడియో కలకలం

Nizamabad | నన్ను ఎన్​కౌంటర్​ చేయండి : యువకుడి సెల్ఫీ వీడియో కలకలం
Nizamabad | నన్ను ఎన్​కౌంటర్​ చేయండి : యువకుడి సెల్ఫీ వీడియో కలకలం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | తనను నిత్యం వేధించే బదులు ఒకేసారి ఎన్​కౌంటర్​ చేయాలని ఓ వ్యక్తి సోషల్​ మీడియా పోస్ట్​ చేసిన వీడియో కలకలం రేపుతోంది. నిజామాబాద్​ నగరానికి చెందిన షేక్​ రసూల్​ ఈ మేరకు వీడియో పోస్ట్​ చేశాడు. రసూల్​ గతంలో అప్పటి మేయర్​ దండు నీతూ కిరణ్​ భర్త శేఖర్​పై దాడి చేశాడు. తన భూమి కబ్జా చేయడంతో దాడి చేశానని ఆయన అప్పట్లో పేర్కొన్నాడు. అయితే ఆ కేసులో అరెస్టయిన రసూల్​ రెండు నెలల క్రితం కండీషన్​ బెయిల్​పై బయటకు వచ్చాడు.

Advertisement
Advertisement

బెయిల్​పై బయటకు వచ్చిన తనను ఐదో టౌన్​ ఎస్సై వేధిస్తున్నారని రసూల్​ ఆరోపించారు. ఆ ఎస్సై బీఆర్​ఎస్​ అభిమాని కావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సై తనను భయపెడుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను వేధిస్తున్నారని పేర్కొన్నాడు. నిత్యం వేధించే బదులు తనను ఎన్​కౌంటర్​ చేయాలని ఎస్సైని ఆయన కోరారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నగరంలోని నెహ్రు పార్క్​ వద్దకు వస్తానని తనను కాల్చివేయాలన్నారు. చెప్పినట్లుగా రసూల్​ మధ్యాహ్నం 12 గంటలకు నెహ్రూ పార్క్​ చౌరస్తాకు వచ్చి, తనను కాల్చాలని ఎస్సైకి సవాల్​ విసిరాడు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Engineering College | ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి