అక్షరటుడే, ఇందూరు: SHANKAR BHAVAN : నగరంలోని శివాజీ నగర్ శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను సోమవారం ఫీల్డ్ ట్రిప్కు తీసుకెళ్లారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే అంశంపై నాగారంలో ఉన్న డంపింగ్ యార్డ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను సందర్శించారు.
శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్, యూనిట్ మేనేజర్ మాధవ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యర్థ పదార్థాలు, కూరగాయల వ్యర్థాలు తదితర వాటి నుంచి కంపోస్ట్ ఏ రకంగా తయారు చేస్తారో వివరించారు.
అనంతరం గుండారంలోని పేపర్ మిల్, అశోక్ సాగర్లోని బయో డైవర్సిటీలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మల్లేశం, గంగా కిషన్, మాధవి, రాములు, శాంతాబాయి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.