అక్షరటుడే, వెబ్డెస్క్: సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయనను గచ్చిబౌలిలో అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె ఠాణాకు తరలించారు. జ్యూడీషియల్ రిమాండ్లో భాగంగా సబ్జైలులో ఉన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు రాజంపేట ప్రభుత్వాస్పత్రికి పోసానిని తరలించారు.
బెయిల్ పిటిషన్ వాయిదా
పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. అయితే ఆ రోజు ఒకవేళ పోసానికి బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో రైల్వే కోడూరు పోలీసులు సోమవారం పీటీ వారెంట్ జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు.