అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గోదావరి పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 100 కోట్లు ఇచ్చి తెలంగాణకు మొండిచేయి చూపడంపై మాజీ మంత్రి హరీశ్‌రావ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సోషల్‌మీడియాలో ట్వీట్‌ చేశారు. తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి రాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రావాల్సిన వాటా కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్‌లో ఘోరంగా విఫలమయ్యాయన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Assembly | 11 రోజులు సమావేశాలు..12 బిల్లులకు ఆమోదం