Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: సీఎం రేవంత్​రెడ్డికి దమ్ముంటే లగచర్ల గ్రామానికి రావాలని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సవాల్​ విసిరారు. లేదంటే తానే కొడంగల్​ వస్తానన్నారు. శనివారం వికారాబాద్​ జిల్లా పరిగిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘కేసీఆర్​ దెబ్బ ఎలా ఉంటుందో మీ గురువును, సోనియా గాంధీని’ అడగాలన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్​ రైతులను మోసం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ప్రస్తుతం కొత్త పథకాల పేరిట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం కోసం మహిళలు కాంగ్రెస్​ నాయకులను నిలదీయాలన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Telangana | తెలంగాణకు పదేళ్లుగా పట్టిన చంద్ర గ్రహణం వదిలింది : సీఎం రేవంత్​