అక్షరటుడే, వెబ్​డెస్క్​: కాంగ్రెస్​ ప్రభుత్వ వైఫల్యంతోనే ఎస్​ఎల్​బీసీ ప్రమాదం చోటు చేసుకుందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. సొరంగం కుంగిపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా మట్టి కూలుతున్నట్లు గుర్తించినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టన్నెల్​లో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకు రావాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్​ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు.