Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: కాంగ్రెస్​ నాయకులు బెదిరింపులతో గ్రామసభలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్​ ఆరోపించారు. ప్రజాపాలన గ్రామసభల నిర్వహణపై ఆయన ‘ఎక్స్’​ వేదికగా స్పందించారు. మోసపూరిత కాంగ్రెస్​ హామీలపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. దీంతో పోలీస్​ పహారాలో గ్రామసభలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పథకాలపై ప్రశ్నించిన వారిపై ఖాకీల జులూమే సమాధానమా అని ఆయన ప్రశ్నించారు. ఆంక్షల మధ్య అర్హులను ఎలా ఎంపిక చేస్తారన్నారు. అటెన్షన్‌ డైవర్షన్‌ ఏమాత్రం చెల్లదని, దరఖాస్తుల దందా నడవదని ఆయన పోస్ట్​ చేశారు.

Advertisement