అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మాజీ మంత్రి కేటీఆర్‌ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం10.30 గంటలకు కేటీఆర్‌ను ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఈ విచారణ కొనసాగనుంది. ఇప్పటికే అరవింద్‌ కుమార్, BLN రెడ్డిని ED విచారించింది. వారి స్టేట్‌మెంట్ల ఆధారంగా.. కేటీఆర్‌ను ఈడీ విచారించబోతోంది.