అక్షరటుడే, ఆర్మూర్: ఢిల్లీలో రైతాంగ ఆందోళనపై జరిపిన కాల్పులకు నిరసనగా ఆర్మూర్లో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. హరియాణ ప్రభుత్వం, మోడీ సర్కారు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.ప్రభాకర్, దేవారం, సురేష్, గంగాధర్, రమేష్, అశోక్, నిఖిల్ మహేష్, అనిల్ పాల్గొన్నారు.