Kalabhairava temple | కాలభైరవ ఆలయ అభివృద్ధికి నిధులు

Kalabhairava temple | కాలభైరవ ఆలయ అభివృద్ధికి నిధులు
Kalabhairava temple | కాలభైరవ ఆలయ అభివృద్ధికి నిధులు

అక్షర టుడే, ఎల్లారెడ్డి: Kalabhairava temple | కాలభైరవ స్వామి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు MLA Madanmohan Rao తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలోని కాలభైరవస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో assembly sessions ఆలయాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరడంతో, ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసిందన్నారు. కొత్త ఏడాదిలో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిలాల్లని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Mission Bhagiratha ఫౌంటెయిన్​ కాదు.. మిషన్​ భగీరథ నీటి వృథా