Advertisement
అక్షరటుడే, ఇందూరు: Integrated schools | రాష్ట్రంలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 55 నియోజకవర్గాల్లో నిర్మించే ఒక్కో భవనానికి రూ. 200 కోట్లు చొప్పున విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రావు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement