అక్షరటుడే, వెబ్డెస్క్ః AP : ఏపీ సీఎం చంద్రబాబునాయకుడు మహిళలకు శుభవార్త చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
AP : రాష్ట్రవ్యాప్తంగా 1,02,832 మందికి లబ్ధి..
రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 1,02,832 మంది మహిళా లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిక్షణ కేంద్రాలను బీసీ సంక్షేమ శాఖ కింద నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
AP : మహిళాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ..
ప్రభుత్వం మహిళలను రిటైల్ దుకాణాలు, టైలరింగ్, అగరుబత్తులు, పామాయిల్, ప్రసిద్ధ కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చీరలు వంటి సాంప్రదాయ చేతిపనుల ఉత్పత్తి వైపు మార్గనిర్దేశం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్ఠం చేశారు.
AP : ప్రభుత్వ ప్రోత్సాహం.. మంత్రి
సామాజిక అభివృద్ధిలో మహిళల పాత్రను సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంపద సృష్టిలో పాల్గొనాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు.
ఎన్నికల హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉండటంలో భాగంగా ఈ ప్రకటన వచ్చిందని మంత్రి సవిత తెలిపారు. సీఎం నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తోన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మహిళలకు విద్య మరియు ఉపాధి అవకాశాలలో 33.33 శాతం రిజర్వ్ చేసిన అంశాన్ని ఆమె ప్రస్తావించారు.
AP : 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో..
రాష్ట్ర ప్రభుత్వం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోని BC, EWS కాపు వర్గాలకు చెందిన 1,02,832 మంది మహిళా లబ్ధిదారులకు ప్రభుత్వం కుట్టు యంత్రాలను అందిస్తుందని మంత్రి సవిత తెలిపారు. ఈ చొరవ కోసం ప్రభుత్వం రూ.255 కోట్లు కేటాయిస్తోందన్నారు. BC సంక్షేమ కార్పొరేషన్ ద్వారా 46,044 మంది, EWS కమ్యూనిటీకి చెందినవారు 45,772 మంది, కాపు కమ్యూనిటీకి చెందినవారు 11,016 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం చివరి దశలో ఉందని ఆమె వెల్లడించారు.