అక్షరటుడే, వెబ్డెస్క్ : Champions Trophy | దేశంలో క్రికెట్ను అభిమానించే వారు కోట్లలో ఉంటారు. భారత్ మ్యాచ్లు ఉన్నాయంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆడుతుందంటే ఇక చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్లను చూడటానికి ఎంతో ఉత్కంఠతో, ఉత్సాహంతో ఉంటారు.
Champions Trophy | ఆదివారం ఫైనల్ మ్యాచ్
టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్తో తుదిపోరులో భారత్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ను చూడటానికి ఇప్పటికే చాలామంది తమ ప్రోగ్రామ్లను మార్చుకున్నారు.
స్టేడియంలో మ్యాచ్ చూడలేకున్నా.. కనీసం పెద్ద టీవీలు, స్క్రీన్లలో చూడాలని అనుకుంటున్నారు. ఫ్రెండ్స్తో కలిసి మ్యాచ్ చూస్తూ ఎంజాయి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి మల్టీప్లెక్స్లు గుడ్ న్యూస్ చెప్పాయి. హైదరాబాద్లోని పలు మల్టీ ప్లెక్స్లలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ను లైవ్ ప్రసారం చేయనున్నాయి. దీంతో మల్టీప్లెక్స్లలో మ్యాచ్ చూడటానికి ఎంతోమంది సిద్ధం అవుతున్నారు.