Ration | రేషన్​ లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ

Ration | రేషన్​ లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ
Ration | రేషన్​ లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ration | రేషన్​(Ration) లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. రేషన్​ కార్డులపై త్వరలో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉగాది(Ugadi) రోజున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించనుంది. సూర్యాపేట(Suryapeta) జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి(Uttam Kumar Reddy) సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.

Advertisement
Advertisement

Ration | బోనస్​తో పెరిగిన సన్నాల సాగు

అధికారంలోకి వచ్చాక రేషన్​ దుకాణాల్లో(Ration Shops) సన్న బియ్యం పంపిణీ చేస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టింది. గతంలో రాష్ట్రంలో సన్నాల సాగు తక్కువగా ఉండేది. పండిన సన్నరకం ధాన్యాన్ని కూడా వ్యాపారులే కొనుగోలు చేసేవారు. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక సన్నాలకు బోనస్(Bonus)​ ప్రకటించింది. సన్నరకం ధాన్యంపై క్వింటాల్​కు రూ.500 అదనంగా ఇస్తుంది. దీంతో రైతులు(Farmers) సన్నాలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. వ్యాపారులకు అమ్ముకుంటే బోనస్​ రాదని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. దీంతో వానాకాలంలో కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్​ లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  CM REVANTH REDDY | సీఎం రేవంత్​ను కలిసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు

Ration | 24 లక్షల మెట్రిక్​ టన్నులు అవసరం

రాష్ట్రంలో రేషన్​ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

Ration | పెరగనున్న లబ్ధిదారులు

ప్రస్తుతం రాష్ట్రంలో 91,19,268 రేషన్‌కార్డులు ఉండగా, వీటిల్లో 2,82,77,859 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డులు ఇస్తామనడంతో పాటు, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో పదేళ్ల నుంచి రేషన్​కార్డుల కొత్తగా ఇవ్వలేదు. దీంతో కార్డులు, లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల బియ్యం అందజేస్తున్నారు.

Advertisement