Parking Fee | ఏపీలో మాల్స్​, మల్టీప్లెక్స్​లకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​

Parking Fee | ఏపీలో మాల్స్​, మల్టీప్లెక్స్​లకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​
Parking Fee | ఏపీలో మాల్స్​, మల్టీప్లెక్స్​లకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parking Fee | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మాల్స్‌లోని పార్కింగ్ ఫీజు(Parking Fee) లపై తాజాగా జీవో విడుదల చేసింది. మాల్స్(Malls)​లో మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్‌ పూర్తిగా ఉచితమని తెలిపింది. 30 నిమిషాల నుంచి గంట వరకు పార్కింగ్‌ చేసిన వ్యక్తులు మల్టీప్లెక్స్‌లు(Multiplex), మాల్స్​లో ఏదైనా వస్తువు కొన్నట్లుగా బిల్లులు, సినిమా టికెట్లు చూపిస్తే వారికి పార్కింగ్​ ఫీజు వసూలు చేయొద్దని సూచించింది. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ యజమానులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిబంధనలు ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

Advertisement
Advertisement
Advertisement