అక్షరటుడే, ఇందూరు: Engineering College | తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఇందూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఏబీవీపీ విభాగ్ కన్వీనర్(ABVP Vibhag Convenor) శశిధర్(Shashidhar) డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్(Additional Collector) కిరణ్ కుమార్(Kiran Kumar)కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులు పట్టణాలకు వెళ్లి చదవాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ(ABVP) సోషల్ మీడియా కన్వీనర్ సునీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్, కంఠేశ్వర్ జోనల్ ఇన్ఛార్జి(Kanteshwar Zonal In-charge) దుర్గా దాస్(Durga Das), ఇంద్రసేన, వేణు, శశివర్ధన్, అభినవ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.