Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: డీఎస్సీ-2008 డీఎస్సీ అభ్యర్థుల ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంలో పోస్టింగ్లు ఇచ్చింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు ఉన్నతాధికారులు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 72 మంది, నిజామాబాద్ జిల్లాలో 70 మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement