Congress : ఇంటింటికి మ‌ద్య‌మా.. ఆదాయం పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎత్తుగ‌డ‌

Congress : ఇంటింటికి మ‌ద్య‌మా.. ఆదాయం పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎత్తుగ‌డ‌
Congress : ఇంటింటికి మ‌ద్య‌మా.. ఆదాయం పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎత్తుగ‌డ‌

అక్షర టుడే, వెబ్ డెస్క్ Congress : తెలంగాణ‌లో (Telangana) కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ (Congress)ఆరు గ్యారెంటీల‌ని ఒక్కొక్క‌టిగా చేస్తూ పోతుంది. అయితే ఇప్పుడు ప్ర‌జ‌లు ఊహించ‌ని ఓ కొత్త ప‌థ‌కం తీసుకొచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఈ ఏడాది బడ్జెట్‌ లక్ష్యాల మేరకు రూ.27 వేల కోట్ల ఎక్సైజ్‌ ఆదాయాన్ని సముపార్జించడానికి మద్యాన్ని టెట్రా ప్యాకెట్లలో విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్న‌ట్టుగా స‌మాచారం అందుతుంది. ఈ టెట్రా ప్యాకెట్స్‌ని పేద ప్రజలు, వ్యవసాయ కూలీలు, సాధారణ రైతులు సులువుగా జేబులో పెట్టుకొని ఎక్క‌డికంటే అక్క‌డికి వెళ్లొచ్చు. టెట్రా ప్యాకెట్‌ అచ్చంగా ఫ్రూటీ ప్యాకెట్‌ మాదిరిగా ఉంటుంది.

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న క్వార్టర్‌ బాటిల్‌ విధానంతో అంచనా వేసిన స్థాయిలో మద్యం (Liquor) అమ్ముడుపోవడం లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలో అమలవుతున్న టెట్రా ప్యాకెట్ల (Tetra packets)విధానం వైపు మొగ్గుచూపుతున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఫైల్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయడం లాంఛనమేనని ఎక్సైజ్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఉన్న కర్ణాటకలో టెట్రా ప్యాకెట్లలో మద్యం వ్యాపారం లాభసాటిగా సాగుతున్నది. అక్కడి ప్రభుత్వం నిరుపేద, దిగువ మధ్యతరగతి, వ్యవసాయ కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని టెట్రా ప్యాకెట్ల విధానం తీసుకొచ్చింద‌ని ప్ర‌తిపక్షాలు అంటున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Earthquake | తెలంగాణలో భూకంపాలు రావు.. క్లారిటీ ఇచ్చిన సైంటిస్ట్​లు

అయితే కర్ణాటకలో (Karnataka) 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ ప్యాకెట్లు విక్రయిస్తుండగా, తెలంగాణలో వీటితోపాటు 60 ఎంఎల్‌ ప్యాకెట్లు కూడా తేవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. సీసా మద్యంతో పోల్చినప్పుడు టెట్రా ప్యాకెట్‌ మద్యం రూ.10 నుంచి రూ.15 తకువ ధరకే లభిస్తుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అంటున్నారు.మద్యం ధర తగ్గడం వలన ప్రభుత్వ సుంకాల రాబడిలో తేడా రాదని, సీసా తీసేస్తున్నాం కాబట్టి ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయని, ఇది వినియోగదారునికి లాభమని ఎక్సైజ్‌ అధికారులు వివరిస్తున్నారు. టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించాలని గత ఏడాది తమిళనాడు, బీహార్‌ Bihar రాష్ట్రాలు భావించిన‌ప్ప‌టికి దానిపై తీవ్ర వ్య‌తిరేఖ‌తో రావ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని విర‌మించుకున్నాయి. మ‌రి రేవంత్ రెడ్డి స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.

Advertisement