CM Revanth Reddy | ప్రభుత్వం కీలక నిర్ణయం.. బెట్టింగ్ యాప్​లపై సిట్​ ఏర్పాటు

CM Revanth Reddy | ప్రభుత్వం కీలక నిర్ణయం.. బెట్టింగ్ యాప్​లపై సిట్​ ఏర్పాటు
CM Revanth Reddy | ప్రభుత్వం కీలక నిర్ణయం.. బెట్టింగ్ యాప్​లపై సిట్​ ఏర్పాటు

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | బెట్టింగ్​ యాప్​లు, వెబ్​సైట్లతో ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్​ యాప్​ల ఆట కట్టించడానికి ఇప్పటికే తెలంగాణ పోలీసులు(Telangana Police) కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బెట్టింగ్​ యాప్​ల(Betting App) వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బుధవారం సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడారు. గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై విచారణకు సిట్​ (SIT)ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

Advertisement
Advertisement

CM Revanth Reddy | చట్టం అమలు కాకపోవడంతో..

ప్రభుత్వం 2017 లో ఆన్​లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్​లపై నిషేధం విధించినా.. పకడ్బందీగా అమలు కాలేదని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. దీంతోనే ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. బెట్టింగ్​, గేమింగ్​ యాప్​లపై, ఆన్​లైన్​ రమ్మీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. దీని కోసం సీబీసీఐడీ లేదా స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Betting Apps | బెట్టింగ్​ యాప్​ కేసు.. దూకుడు పెంచిన పోలీసులు

CM Revanth Reddy | వారిపై కేసులతో సమస్య తీరదు

బెట్టింగ్​ యాప్​ల విషయంలో రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వ్యక్తుల ప్రమోయం ఉందన్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్​ చేసిన వారిపై కేసులు నమోదు చేసి విచారించామన్నారు. దీంతో సమస్య తీరదని సీఎం పేర్కొన్నారు. దీంతో సిట్​ ఏర్పాటు చేసి బెట్టింగ్​ యాప్​ల నియంత్రణకు చర్యలు చేపడుతామన్నారు. గతంలో చేసిన చట్టంలో శిక్షలు తక్కువగా ఉన్నాయని, వాటిని సవరిస్తామని సీఎం తెలిపారు. బెట్టింగ్​ యాప్​ నిర్వాహకులు, ప్రమోట్​ చేసిన వారు, ఇంకా దీని వెనకల ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement