HCU | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హెచ్​సీయూ నుంచి పోలీసుల ఉపసంహరణ

HCU | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హెచ్​సీయూ నుంచి పోలీసుల ఉపసంహరణ
HCU | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హెచ్​సీయూ నుంచి పోలీసుల ఉపసంహరణ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HCU | కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి చదును చేస్తుండగా హెచ్​సీయూ విద్యార్థులు(HCU Students) ఆ భూములు యూనివర్సిటీవే అంటూ ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఇదివరకే ఆదేశించారు. తాజాగా యూనివర్సిటీ నుంచి పోలీసుల బలగాలను ఉపసంహరించనున్నట్లు ఆయన ప్రకటించారు.

Advertisement
Advertisement

హెచ్​సీయూ భూముల వ్యవహారంతో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు యూనివర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విద్యార్థులు కాకుండా బయట వ్యక్తులు లోనికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అయితే సోషల్​ మీడియా(Social Media) ప్రచారం, విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇది కూడా చ‌ద‌వండి :  HCU | ​హెచ్​సీయూ విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు నిర్ణయం

ఇప్పటికే భూముల గురించి తెలుసుకోవడానికి సబ్​ కమిటీ(Sub committee) వేసిన విషయం తెలిసిందే. తాజాగా యూనివర్సిటీ నుంచి పోలీసులను వెనక్కి రప్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి హెచ్​సీయూ వీసీ(HCU VC)కి లేఖ రాశారు. స్వీయ భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. క్యాంపస్‌లో శాంతిభద్రతల బాధ్యత వర్సిటీదేనని ఆయన స్పష్టం చేశారు. పౌర సంఘాలు, అధ్యాపకుల వినతి మేరకు ఈ చర్యలు చేపట్టారు.

Advertisement