అక్షరటుడే, వెబ్డెస్క్: GROUP-1 | టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను టీజీపీఎస్సీ వైబ్సైట్లో పొందుపర్చారు. మొత్తం 563 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. పరీక్షలు గతేడాది అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు నిర్వహించారు. ప్రిలిమ్స్లో 31,383 మంది అర్హత సాధించినప్పటికీ.. మెయిన్స్కు 21,093 మంది హాజరయ్యారు.
15 రోజుల్లోగా రీకౌంటింగ్కు అవకాశం..
గ్రూప్ అభ్యర్థులు మార్కులను ప్రకటించిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ..15 రోజుల్లోగా రూ.1,000 చెల్లించి రీకౌంటింగ్కు అవకాశం కల్పించారు. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లెక్కింపులో పొరపాట్లు జరిగినట్లయితే.. సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది.