అక్షరటుడే, వెబ్డెస్క్: GT vs MI, IPL – 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా 9వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా సాగిన ఈ మ్యాచ్లో 36 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది.
టాస్ ఓడిన శుభ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బాల్ ను ఎక్కువగా బౌండరీలు దాటించలేకపోయారు కానీ, సింగిల్స్, డబుల్స్ ను వదిలి పెట్టకుండా తీశారు. బ్యాటర్లలో సాయి సుదర్శన్ (63) టాప్ స్కోర్ చేశాడు.
గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 38 పరుగులు) చక్కని ఆట తీరు ప్రదర్శించాడు. 78 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడారు. గిల్ ఔట్ అయ్యాక వచ్చిన జోస్ బట్లర్(39) దూకుడు చూపాడు.
ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబుర్ రహమాన్, సత్యనారాయణ రాజు ఒక్కో వికెట్ తీశారు.
ముంబై బ్యాటర్లు పేలవ ఆట తీరును ప్రదర్శించారు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగారు. 15 ఓవర్లకే ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి ఖరారు అయింది. 197 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. అంతకు ముందు నాలుగు బాల్స్ ఆడి రెండు ఫోర్లు కొట్టాడు. తిలక్ వర్మ 39 పరుగులు చేసి రాహుల్ తెవాతియాకు క్యాచ్ ఇచ్చాడు.
రాబిన్ మింజ్(3) రాణించలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ (48), హార్దిక్ పాండ్యా(11) కూడా క్యాచ్ ఔట్ అయ్యారు.