GT vs PBKS | బోణీ కొట్టిన పంజాబ్​..గుజరాత్​​ బ్యాటర్ల శ్రమ వృథా

GT vs PBKS | బోణీ కొట్టిన పంజాబ్​..గుజరాత్​​ బ్యాటర్ల శ్రమ వృథా
GT vs PBKS | బోణీ కొట్టిన పంజాబ్​..గుజరాత్​​ బ్యాటర్ల శ్రమ వృథా

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GT vs PBKS : ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడగా.. గుజరాత్​ జట్టును మట్టి కరిపించి, 11 పరుగుల తేడాతో పంజాబ్​ జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ తరఫున అరంగేట్రం చేశాడు.

Advertisement
Advertisement

టాస్ ఓడి బ్యాటింగ్​ చేపట్టిన పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ను ఎదుట భారీ టార్గెట్ ఉంచింది. పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీకి 3 పరుగుల దూరంలో ఆగిపోయాడు. 9 సిక్సులు, 5 ఫోర్లతో ఏకంగా 230కి పైగా స్ట్రైక్​ రేట్​తో గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉండటం విశేషం.

ఇది కూడా చ‌ద‌వండి :  IPL 2025: CSK పై MI తరఫున అరంగేట్రం చేసిన పేసర్ సత్యనారాయణ రాజు ఎవరో తెలుసా..!

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్​ జట్టు.. వికెట్లు కాపాడుకున్నా.. లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. జట్టు గెలుపునకు చమటోడ్చిన సుదర్శన్​(74 పరుగులు) శ్రమ వృథా అయింది. జోష్​ బట్లర్​ 54 పరుగులు చేసి ఔట్​ అయ్యాడు. రూథర్​ ఫర్డ్ జట్టు గెలుపు కోసం చివరి వరకు పోరాడి(46 పరుగులు) ఔట్​ అయ్యాడు. అర్షదీప్​ వేసిన 19.4 బాల్​ను వికెట్ల మీదికి ఆడి, రాహుల్​ తెవాతియా(6) రనౌట్​కు కారణమయ్యాడు.

 

Advertisement