అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | గోల్డ్ కాయిన్స్(Gold Coins) ఉన్నాయని చెప్పి నగల వ్యాపారులకు టోకరా వేశారు కేటుగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి(Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తమ దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉన్నాయని, అమ్ముతామని ఇద్దరు నగల వ్యాపారులను(Jewelers) దుండగులు పిలిచారు. తీరా అక్కడకు వెళ్లాక వ్యాపారుల దృష్టి మరల్చి వారి వద్ద ఉన్న బంగారం(Gold), నగదు ఎత్తుకెళ్లారు. అర కిలో బంగారం, 18 వేల యూఎస్ డాలర్స్(US Dollars) ఎత్తుకెళ్లినట్లు బాధితుడు నార్సింగి(Narsingi)కి చెందిన చంద్రశేఖర్(Chandrasekhar) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు (Police) నిందితుల కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు.