అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: INDURU TIRUMALA | నర్సింగ్పల్లి(NARSINGPALLI Induru Tirumala) ఇందూరు తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గంగోత్రి రామానుజదాసు స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే పుణ్యఫలాలు దక్కుతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహా రెడ్డి, విజయసింహారెడ్డి, యజ్ఞాచార్యులు శ్రీమన్నారాయణ శిఖామణి, శ్రీఖరాచార్యులు, సంపత్ కుమారాచార్య, రోహిత్ కుమారాచార్య, ఆచార్య నరసింహ మూర్తి, శ్రీధరాచార్య, నర్సారెడ్డి, నరాల సుధాకర్, భాస్కర్, ప్రసాద్, రమేష్, మురళి, నరేందర్, సురేష్ తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.