అక్షరటుడే, వెబ్డెస్క్: HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య నెలకొన్న ఐపీఎల్ టికెట్ల IPL ticket వివాదంలో విజిలెన్స్ అధికారుల ఎంక్వైరీ మొదలైంది. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో మంగళవారం ఉప్పల్ స్టేడియంలో విచారణ చేపట్టారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుతో పాటు స్టేడియం సిబ్బందిని విచారించినట్లు సమాచారం.
HCA | ఒప్పందాలపై విచారణ
ఎస్ఆర్హెచ్(SRH), హెచ్సీఏ(HCA) మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ-మెయిల్స్ సైతం చెక్ చేసినట్లు తెలిసింది. ఐపీఎల్కు ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై సైతం విచారించినట్లు సమాచారం.
HCA | సీఎం రేవంత్ స్పందించడంతో..
టికెట్లు, పాస్ ల కోసం తమను ఇబ్బంది పెడుతున్నారంటూ సీఎం రేవంత్రెడ్డికి CM Revanth Reddy ఎస్ఆర్హెచ్ యాజమాన్యం SRH management లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అంతేకాకుండా విచారణ చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.