అక్షరటుడే, వెబ్డెస్క్ : IPL | ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. మ్యాచ్ల కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడాలని అనుకుంటున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా జరిగే తొలి రెండు మ్యాచ్లకు సంబంధించి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభం కానుంది. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీని ఉచితంగా ఇస్తామని SRH ప్రకటించింది. 23న రాజస్థాన్, 27న లక్నోతో హైదరాబాద్ టీం మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లకు సంబంధించిన టికెట్ల విక్రయం 11గంటలకు మొదలు కానుంది.