అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేయడానికి ప్రయోగించిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతం అయింది. రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేసి ఈ సాంకేతిక అందిపుచ్చుకున్న నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఈ ప్రయోగాన్ని డిసెంబర్ 30న ఇస్రో చేపట్టింది. రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేయడానికి జనవరి 7, 9 తేదీల్లో ప్రయత్నించినా.. సాంకేతిక కారణాలతో వాయిదా వేసింది. తాజాగా రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసినట్లు ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement