BODHAN | అక్కడంతా ‘రైటర్ల’ రాజ్యమే..
BODHAN | అక్కడంతా ‘రైటర్ల’ రాజ్యమే..
Advertisement

అక్షరటుడే,బోధన్: BODHAN | పట్టణంలోని సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో డాక్యుమెంట్​ రైటర్ల హవా నడుస్తోంది. కార్యాలయంలో నిత్యం ధరఖాస్తుదారులే కాకుండా రైటర్లు హంగామా సృష్టిస్తున్నారు. ఒక్కో ప్లాట్​ రిజిస్ట్రేషన్​ కోసం రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. వారిని దాటి నేరుగా ఆఫీస్​కు వెళ్తే.. ఏ పని చేయకుండా అధికారులు కొర్రీ పెడుతున్నారు.

BODHAN | సిండికేట్​గా మారి..

బోధన్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయానికి సంబంధించి దస్తావేజు లేఖరులు సిండికేట్​గా మారారు. ఒక్కో డాక్యుమెంట్​కు రేట్​ ఫిక్స్​ చేసి అక్రమంగా దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇంటి రిజిస్ట్రేషన్​ కోసం రూ.5,000 తీసుకుంటున్నారు. ప్రస్తుతం రియల్​ ఏస్టేట్​ వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదు. జరిగే ఆ కొద్దిపాటి డాక్యుమెంట్ల​ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వీరితో అధికారులు కుమ్మక్కై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కినా.. ఇక్కడి అధికారుల వసూళ్లు మాత్రం ఆగట్లేదు.

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan | వాహనం ఢీకొని జింక మృతి

ఎవరికీ డబ్బులు ఇవ్వక్కర్లేదు..

– సాయినాథ్, సబ్ రిజిస్ట్రార్​
ప్రభుత్వం సూచించిన మేరకే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాలి. ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 30 ఫైళ్లకు మించి రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ప్రతి ఫైల్​ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అనంతరమే రిజిస్ట్రేషన్​కు అనుమతిస్తున్నాం.
Advertisement