అక్షరటుడే, వెబ్డెస్క్ : Betting App | బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్లతో రాష్ట్రంలో ఎంతోమంది జీవితాలు రోడ్డున పడ్డాయి. దీంతో డబ్బు కోసం యాప్ను ప్రమోట్ చేసిన వారు తప్పించుకోకుండా పక్కాగా కేసులు నమోదు చేయాలని పోలీసులను(Telangana Police) ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో బెట్టింగ్యాప్ ప్రమోటర్లపై(Betting App Promoters) చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నాయి.
Betting App | ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే
బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantarao) కోరారు. ఆయన శనివారం నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్(Police Station)లో ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహిస్తున్న వారిపై ఓయూ పీఎస్లో జనసేన (Janasena) విద్యార్థి విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు.
Betting App | మిగతా ప్రాంతాల్లో..
బెట్టింగ్ యాప్లతో అప్పుల పాలై ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు వారి వివరాలు కూడా సేకరించారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ప్రోత్సహించడంతోనే వారు ఆ ఊబిలో చిక్కుకున్నారని చెబుతున్నారు. కుమారుడు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలు కావడంతో నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో నవంబర్ 4న తల్లిదండ్రులు, కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఆ కేసులో సైతం తాజాగా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను చేర్చారు.
దీనిని బట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నిందితులు తప్పించుకోకుండా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇందులో సినీ ప్రముఖులు ఉండటంతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.