తులం బంగారం హామీని నెరవేర్చాలి

0

అక్షరటుడే ఇందూరు: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం లబ్ధిదారులకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా డిమాండ్‌ చేశారు. సోమవారం ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.