అక్షరటుడే, కామారెడ్డి: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను శుక్రవారం రాత్రి కలెక్టర్ సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. చదువు, ఆటలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఫిజికల్ ఫిట్నెస్, భోజనం ఎలా ఉందని ఆరా తీశారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, వంద శాతం రిజల్ట్ రావాలని సూచించారు. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మండల ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్, ప్రిన్సిపల్ శివరాం, జోనల్ ఆఫీసర్ పూర్ణ చందర్, తహశీల్దార్ సువర్ణ, ఎంపీడీవో తిరుపతి రెడ్డి, మండల విద్యాధికారి ఆనంద్ రావు పాల్గొన్నారు.
కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలి
Advertisement
Advertisement