అక్షరటుడే, కామారెడ్డి: చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి విడుదలైన కొన్ని రోజులకే మళ్లీ దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ చంద్రశేఖర్ రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ చౌరస్తా సమీపంలో ఉన్న విజయ సూపర్ మార్కెట్లో జనవరి 25న చోరీ జరిగింది. గోడకు రంధ్రం చేసి లోనికి చొరబడి దొంగతనం చేశారు. ఈ కేసులో మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామానికి చెందిన పాత నేరస్తులు లంబాడి దేవసోత్ రాజు, లంబాడి బుట్ట రాజును అరెస్ట్ చేశారు. గతంలో వీరు పాపన్నపేట్, టేక్మాల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి జనవరిలో విడుదలయ్యారని సీఐ తెలిపారు. మళ్లీ కామారెడ్డి, తూప్రాన్ పట్టణాల్లో దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఆయన వివరించారు. వారి నుంచి ఒక బైక్, 2 ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామని తెలిపారు.
జైలుకెళ్లొచ్చి.. మళ్లీ చోరీలు
Advertisement
Advertisement