Kishan Reddy | భూములు వేలం వేయొద్దని సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

Kishan Reddy | భూములు వేలం వేయొద్దని సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ
Kishan Reddy | భూములు వేలం వేయొద్దని సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kishan Reddy | హైదరాబాద్​ నగరంలోని హెచ్‌సీయూలో 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి(Kishan Reddy) కోరారు.

Advertisement
Advertisement

ఈ మేరకు ఆయన సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)కి గురువారం లేఖ రాశారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో భూములు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గచ్చిబౌలి(Gachibowli)లోని 400 ఎకరాల భూములు వేలం వేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అసెంబ్లీ(Assembly)లో ప్రకటించారు.

ఆ భూములు రిజర్వ్​ ఫారెస్ట్(Reserve Forest)​కు చెందినవి కావని, కొందరు గుంట నక్కలు ఆ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తే ప్రభుత్వం కాపాడిందన్నారు. ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఆ భూములకు వేలంపాట నిర్వహిస్తామని ప్రకటించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Today Gold Rate : ఉగాదికి ముందు మ‌హిళ‌ల‌కి షాక్ ఇచ్చిన బంగారం.. ఇంత పెరిగిందేంటి?

కాగా ప్రభుత్వం భూముల అమ్మకం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కిషన్​రెడ్డి(Kishan Reddy) లేఖలో కోరారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్​రెడ్డి(Revanth Reddy) వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.

Advertisement