అక్షరటుడే, వెబ్డెస్క్: RR vs KKR : ఐపీఎల్ -18లో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) శుభారంభం చేసింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది.
రాజస్థాన్ బౌలర్లలో హసరంగ ఒక వికెట్ మాత్రమే తీశాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓడర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటర్లలో ధ్రువ్ జురెల్ (33) ఈ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేశాడు.
టాస్ నెగ్గిన రాజస్థాన్ జట్టు.. తొలుత బ్యాటింగ్ చేపట్టి, నిర్ణీత(20) ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 151 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్ల ధాటిని రాజస్థాన్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (33; 28 బంతుల్లో 5 ఫోర్లు) కాస్త రాణించగలిగాడు.
రాజస్థాన్ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), సంజు శాంసన్ (13; 11 బంతుల్లో 2 ఫోర్లు) మైదానంలో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. కెప్టెన్ రియాన్ పరాగ్ (25, 15 బంతుల్లో 3 సిక్స్లు) దూకుడుగా ఆడి, వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. నితీశ్ రాణా (8), వానిందు హసరంగ (4), శుభమ్ దూబె (9) పస లేని ఆటతీరును ప్రదర్శించారు. చివరగా జోఫ్రా ఆర్చర్(16; 7 బంతుల్లో 2 సిక్స్లు) వల్ల స్కోరు 150 దాటగలిగింది.
కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. స్పెన్సర్ జాన్సన్ ఒక వికెట్ తీశాడు.