PCC Chief Bomma Mahesh Kumar | కేటీఆర్ అరెస్టు తప్పదు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు

PCC Chief Bomma Mahesh Kumar | కేటీఆర్ అరెస్టు కావాల్సిందే..
PCC Chief Bomma Mahesh Kumar | కేటీఆర్ అరెస్టు కావాల్సిందే..

అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief Bomma Mahesh Kumar | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రసిడెంట్​(BRS Working President) ఎట్టిపరిస్థితుల్లో అరెస్ట్​ కావాల్సిందేనని పీసీసీ చీఫ్(PCC chief)​ వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్నారు.

Advertisement
Advertisement

హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్​ఎస్​ నేతలు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. తెల్లరేషన్​కార్డు (White ration card) లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ నిరాటంకంగా సాగుతోందని.. సన్నబియ్యంపై మాట్లాడే హక్కు బీఆర్​ఎస్​(BRS)కు లేదన్నారు. కేసీఆర్​ కుటుంబ సభ్యులే దొడ్డుబియ్యంను సన్నబియ్యంగా మార్చి ఎగుమతి చేసిన విషయం మరిచారా అని ప్రశ్నించారు.

PCC Chief Bomma Mahesh Kumar | ప్రజాపాలన అంటే ఎంటో చూపించాం..

15 నెలల్లోనే ప్రజాపాలన అంటే ఏంటో కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) చూపించిందని పీపీసీ చీఫ్​ వివరించారు. అంబేడ్కర్​ జయంతి(Ambedkar Jayanti) సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జీవో విడుదలైందన్నారు. భూభారతితో భూ వివాదాలకు పరిష్కారం లభించిందన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్​గా రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిలిచారన్నారు. రేపు సీఎల్పీ సమావేశం నోవాటెల్​(Novatel)లో జరుగనుందన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నాయకులు వినోద్ రెడ్డి, ఏనుగు రవీందర్, కైలాష్ కుమార్, సిద్దేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MLA Prashanth Reddy | తెలంగాణను అగ్రగామిగా నిలిపింది కేసీఆర్: ప్రశాంత్ రెడ్డి ​